Wednesday, April 1, 2009

loksatta ki vote veddam - 1

ఇరవయ్ నాలుగేళ్ళ వయసులో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్ సింగ్
బ్రిటిష్ ప్రభుత్వం లో అత్యుత్తమ పదవిని వదిలి స్వతంత్రం కోసం పోరాడిన సుభాష్ చంద్ర బోస్
స్వరాష్ట్రం కోసం ప్రాణ త్యాగమే చేసిన పొట్టి శ్రీరాములు
అలాంటి నాయకుల వెతికే బాటలో మనకు దొరికింది.......

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని బొంద బెట్టాలే... - కే సి ఆర్, తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షుడు
నువ్వు నీ తల్లి కి ఎందుకు పుట్టానా అనుకునే లా చేస్తా నిన్ను !!! - వై ఎస్ రాజశేకర రెడ్డి, ముఖ్య మంత్రి
మరి అయన, ఆయన తమ్ముడు ఎంతమంది ని పడుకో బెట్టాడో సినిమాల్లో ఛాన్స్ ల కోసం !!! - రోజా, తెలుగు దేశం పార్టీ MLA అభ్యర్థి
ఒరేయ్ నాని, **** కొడకా, ఆయనకు అనుభవం లేదా ?? - పోసాని కృష్ణ మురళి, ప్రజా రాజ్యం పార్టీ నేత

ఇదేనా ఇన్నేళ్ళ మన అన్వేషణ ? ఇంకెన్నాళ్ళు ? ఇంతకన్నా మంచి నాయకులూ దొరకలేదా మనకు ??

MBBS, IAS

కలెక్టర్ గా ఎంతో పరిమితమైన అధికారాలు వున్న సమయంలో, కేవలం రెండు కోట్ల వ్యయం తో 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించిన జయ ప్రకాష్ నారాయణ నాయకత్వం లో,
విద్య, వైద్యం, వ్యవసాయం.. ఏ విషయం మీదైనా పటిష్టమైన అవహగన వున్న జయప్రకాశ్ నారాయణ నాయకత్వం లో,

చదువుకున్న వాళ్ళు, యువత, సేవ చెయ్యాలనే తపన, నిబద్దత వున్న నాయకులను ఎన్నుకుందాం, లోక్ సత్తా కి వోటు వేద్దాం. నవ సమాజం నిర్మిద్దాం.

లోక్ సత్తా గెలవదు అనే సందేహమే వద్దు. గత సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్ సత్తా అభ్యర్థి కటారి శ్రీనివాస రావు కి అరవయ్ వెయ్యిల వోట్లు వచ్చాయ్ !!

మేం ఐదు వేల మంది 30 ఎల్ల లోపు యువకులం ఎంపిక చేసుకున్న పది నియోజక వర్గాల్లో, కేవలం మార్పూ రావాలనే తపనతో ఇంటి ఇంటికి తిరిగి లోక్ సత్తా కి ప్రచారం చేస్తున్నాం. మార్పూ సాధ్యం. లోక్ సత్తా జనం కి చేరువ అవుతుంది. తప్పక గెలుస్తుంది. నిస్సందేహంగా వోటు వెయ్యండి. జై హింద్ !!

No comments: